ప‌వ‌న్ బాకీ తీరుస్తున్న తేజూ

మరిన్ని వార్తలు

మెగా హీరోలు ఎంత మంది ఉన్నా... వాళ్ల‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ప్ర‌త్యేక‌మైన అభిమానం. తేజూ క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు.. మాన‌సికంగా, ఆర్థికంగా స‌హాయం చేసింది ప‌వ‌న్ క‌ల్యాణే అని స‌న్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ప‌వ‌న్ బాకీ తీర్చుకునే అవ‌కాశం తేజూకి వ‌చ్చింది. అవును... ఇప్పుడంటే ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు గానీ, కొంత‌కాలం క్రితం ప‌వ‌న్ సినిమాల‌కు దూరంగానే ఉన్నాడు. నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సులు తీసుకున్నా సినిమాలు చేయ‌లేని ప‌రిస్థితి. భ‌గ‌వాన్ - పుల్లారావుల‌ ద‌గ్గ‌ర కూడా ప‌వ‌న్ అడ్వాన్సులు తీసుకున్నాడ‌ని టాక్‌. కానీ వాళ్ల‌తో సినిమా చేయ‌లేదు.

 

ప‌వ‌న్ సినిమా చేస్తాడ‌ని మాట ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తాడు. భ‌గ‌వాన్ - పుల్లారావులు కూడా అదే న‌మ్మారు. కానీ ఇంత వ‌ర‌కూ చేయ‌లేదు. భ‌విష్య‌త్తులోనూ చేసే అవ‌కాశం లేదు. అందుకే.. ఇప్పుడు ఆ స్థానంలోనే సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాని ప‌ట్టాలెక్కించిన‌ట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయిధ‌ర‌మ్ - దేవాక‌ట్టా కాంబోలో ఓ సినిమా మొద‌లైంది. నిజానికి ఇది ప‌వ‌న్ చేయాల్సిన సినిమా అని, త‌న‌కు తీరిక లేక‌పోవ‌డం వ‌ల్లే తేజూ కాల్షీట్లు ఇప్పించాడ‌ని చిత్ర‌సీమ‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మావ‌య్య కోసం తేజూ ఈ ప్రాజెక్టుని ఒప్పుకున్నాడ‌ని చెబుతున్నారు. ఈ రూపంలో మావ‌య్య బాకీ తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చింద‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS