ప‌వ‌న్ బ్యాన‌ర్‌కి మ‌ళ్లీ ప‌ని ప‌డింది.

మరిన్ని వార్తలు

రాజ‌కీయాల్లో చేదు అనుభ‌వం ఎదురైన నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ని మ‌ళ్లీ వెండి తెర‌పై చూడాల‌ని, ఆయ‌న సినిమాలు చేయాల‌ని అభిమానులు గ‌ట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ప‌వ‌న్ సినిమా చేస్తే - ఆ కిక్‌, హైప్ వేరుగా ఉంటాయి. ఇప్ప‌టికీ ప‌వ‌న్ బ‌రిలో దిగాడంటే - పాత రికార్డుల బూజు దుల‌పాల్సిందే. కానీ... ప‌వ‌న్ దృష్టి మాత్రం ఇంకా రాజ‌కీయాల‌పైనే ఉంది. జ‌న‌సేన పార్టీని బ‌లోపితం చేయాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌వ‌న్ ని మ‌ళ్లీ వెండి తెర‌పై చూడ‌డం క‌ష్ట‌మే. కాక‌పోతే... ప‌వ‌న్ బ్యాన‌ర్‌కి మాత్రం ఇప్పుడు ప‌ని ప‌డింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ పేరుతో ప‌వ‌న్‌కి సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇప్పుడు ఈ సంస్థ పై కొన్ని చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి సినిమాలు చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఆ బాధ్య‌త త‌న మిత్రుడైన శ‌ర‌త్ మ‌రార్‌కి అప్ప‌గించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ సంస్థ ఇప్ప‌టికే కొన్ని క‌థ‌లు సిద్ధం చేసింద‌ని, వాటిలో ఒక‌ట్రెండు సినిమాల్ని తెర‌కెక్కించాల‌ని ఆ ఫ‌లితాల్ని బేరీజు వేసుకుని సినిమా నిర్మాణాన్ని మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ మేర‌కు శ‌ర‌త్ మ‌రార్‌తో ప‌వ‌న్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడ‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS