ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ప‌వ‌న్ వార్నింగ్‌.

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడ‌ని, త్వ‌ర‌లో ఆయ‌న కెమెరా ముందుకు రాబోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో వార్త‌లు గ‌ట్టిగానే చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. క్రిష్ నుంచి సందీప్ రెడ్డి వంగా వ‌ర‌కూ ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి. ప‌వన్ తో సినిమా చేయ‌డానికి న‌లుగురైదుగురు నిర్మాత‌లు కూడా రెడీగా ఉన్నారు. అయితే వీళ్లంద‌రికీ ప‌వ‌న్ క్లియ‌ర్ క‌ట్ గా ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చేశాడ‌ట‌. త‌నంత‌ట తాను సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించేంత వ‌ర‌కూ ఎవ‌రూ నోరు మెద‌ప‌వ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ట‌.

 

అలా ఎవ‌రైనా తొంద‌ర‌ప‌డి సినిమా ప్ర‌క‌టిస్తే - ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తాన‌ని అంటున్నాడ‌ట‌. ప‌వ‌న్ త‌దుప‌రి సినిమాని స్వ‌యంగా ప‌వ‌నే ప్ర‌క‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈలోగా.. ఎలాంటి క‌థ చేయాలి? ఎవ‌రితో చేయాలి? ఎప్పుడు చేయాలి? అనే విష‌యంపై నిర్ణ‌యం తీసుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ సినిమా విష‌యం అటు నిర్మాణ సంస్థ‌గానీ, ఇటు ద‌ర్శ‌కుడుగానీ ప్ర‌క‌టించ‌లేరు.

 

అది పూర్తిగా ప‌వ‌న్ నోటి నుంచి రావాల్సిందే. ఏదేమైనా ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకోవ‌డం ప‌వ‌న్ అభిమానుల్ని ఖుషీ చేసే సంగ‌తే. అయితే ఎలాంటి క‌థ ఎంచుకుంటాడు? ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేవి తేలాలంటే మాత్రం ఓపిగ్గా ఎదురుచూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS