హీరోయిన్ కి వివాదం తెచ్చిపెట్టిన కామెంట్స్...

మరిన్ని వార్తలు

ఒక్కోసారి సెలబ్రిటీలు ముందు వెనక ఆలోచించకుండా చేసే కామెంట్స్ వారిని వివాదాల్లో పడేస్తాయి. 'ఆర్‌ఎక్స్‌100' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్‌ ఇలాంటి ఇబ్బందుల్లోనే పడింది. ఇటీవలే విడుదలైన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జీరో' సినిమా పై పాయల్ చేసిన కామెంట్స్, ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 

 

షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ మరియు కత్రినా కైఫ్ ముఖ్య పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ 'జీరో' ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. అయితే, ఈ మూవీలో అనుష్క చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ, కథా.. కథనాలు సరిగా లేకపోవటంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా దారుణమైన పరాజయం పాలైన సంగతి మనకి తెలిసిందే.

 

అయితే, ఈ సినిమా చూసిన తర్వాత పాయల్ రాజ్‌పుత్‌ చేసిన కామెంట్స్ కి షారుక్ అభిమానులు గుర్రుమంటున్నారు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన ఇలా చేయడం తగదంటూ ఒకరు కామెంట్‌ చేయగా.. మీరు అంటే ఇంతవరకు ఇష్టం ఉండేది కానీ, ఇది చూశాక అదీ కాస్త పోయిందని మరొకరు పాయల్‌పై కామెంట్స్ చేసారు. అయితే వాటి తీవ్రతను గమనించిన పాయల్ తనపై వస్తోన్న నెగిటివిటీని తగ్గించుకునేందుకు వివరణ కూడా ఇచ్చుకుంది. 

 

తాను షారుఖ్ గురించి మాట్లాడలేదని, సాగతీతగా ఉన్న జీరో సినిమా కథపై మాత్రమే మాట్లాడానని, పైగా తాను షారుఖ్ కి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ మూవీ బావుందని, సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసినట్టు బోరింగ్ గా ఉంది. అది తప్ప మిగతా అంతా ఓకే అంటూ తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ కి వివరణ ఇచ్చింది. కానీ, ఈ లోపే సోషల్ మీడియాలో తనపై రావాల్సిన నెగటివిటీ వచ్చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS