తెలుగు సినీ పరిశ్రమ తరఫున కరోనాపై ఇటీవల ఓ పాట రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ పాటను రూపొందించారు. పాటని ఆయనే ఆలపించగా, ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితోపాటు కింగ్ అక్కినేని నాగార్జున, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కనిపించారు. చిరంజీవి, నాగార్జున, వరుణ్, సాయి ధరమ్ తేజ్.. కన్పించడంతో పాటకి మైలేజ్ అనూహ్యంగా పెరిగింది. ఈ పాట ఢిల్లీకి కూడా చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఈ పాట చూసి, చిరంజీవి సహా ఇందులో కన్పించిన అందరిపైనా ప్రశంసలు కురిపించారు. అయితే, ప్రధాని సంగీత దర్శకుడు కోటి పేరు ప్రస్తావించడం మర్చిపోయారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
— Narendra Modi (@narendramodi) April 3, 2020
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
మరోపక్క, ప్రధాని స్పందనపై ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ‘సంగీత దర్శకుడు కోటిగారు.. అలాగే మా అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు..’ అంటూ కోటి పేరుని ప్రస్తావించడం గమనార్హం. ఎంతైనా మెగాస్టార్ మెగాస్టారే.! ఇదిలా వుంటే, ఈ పాటలో మరికొందరు కూడా కన్పించాల్సి వుందనీ, కొన్ని కారణాలతో వీలుపడలేదనీ, ఇంకా మరికొన్ని పాటల్ని కరోనాపై రూపొందిస్తామని సంగీత దర్శకుడు కోటి చెప్పుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత చాలా ఎక్కువనీ, ఆ విషయం పలు సందర్భాల్లో నిరూపితమయ్యిందని కోటి చెప్పుకొచ్చారు.
Thank you Shri @narendramodi ji for your kind words. Heartily appreciate your tireless efforts to contain the damage from #CoronaCrisis to our country. We are doing our little bit to partake in this humongous task. సంగీత దర్శకుడు కోటి గారు & మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు https://t.co/K7bCljEakG
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2020