ఇటీవలే యూరప్లో షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చిన ‘జాన్’ టీమ్, అక్కడి షూటింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న టైమ్లోనే చిత్ర యూనిట్ ఈ షూటింగ్ కోసం యూరప్ వెళ్లింది. ఎలాగైనా షూటింగ్ కంప్లీట్ చేయాలన్న పట్టుదలతో అతి జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చింది. జాగ్రత్తల నడుమ షూటింగ్ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఈ షెడ్యూల్తో తెలిసిందనీ చిత్రయూనిట్ చెబుతోంది.
ఇదిలా ఉంటే, మధ్యలోనే జాన్ షూటింగ్ ఆపేసి, తిరిగొచ్చేశారనే గాసిప్ మరోవైపు ఉంది. కానీ, అనుకున్న ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పెట్టుకున్న టార్గెట్ కన్నా, రెండు రోజుల ముందే ఫినీష్ చేసి వచ్చేశామని తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ వివరణ ఇచ్చారు. అలాగే, షూటింగ్ టైమ్లో మాస్క్లు ధరించడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, వాడిన వస్తువుల్ని శానిటైజ్ చేసుకోవడం, రెగ్యులర్గా టెంపరేచర్స్ చెక్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పక్కాగా పాఠించామని ఆయన తెలిపారు.
ఇక ఇండియాకి తిరిగొచ్చాక, హీరో ప్రబాస్, హీరోయిన్ పూజా హెగ్దేతో సహా టీమ్ అంతా 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా ‘జాన్’ తాజా షెడ్యూల్ ఓ డిఫరెంట్ అనుభూతిని మిగ్చబోతోందని చిత్ర యూనిట్ స్పందించింది.