ప్రభాస్‌.. మళ్ళీ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌!

మరిన్ని వార్తలు

‘సాహో’ సినిమాతో బాలీవుడ్‌ స్థాయి కాదు, హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు ప్రభాస్‌. మళ్ళీ అదే అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ సీక్వెన్సెస్‌తో అలరించేందుకు ప్రభాస్‌ సిద్ధమవుతున్నాడట. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఇటీవలే టీమ్ మొత్తం విదేశాలకు వెళ్ళింది. అక్కడే ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించారట. ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి పనిచేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ వెల్లడించింది.

 

ప్రభాస్‌ సరసన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సాహో’ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు, ఈ సినిమాలో జరగకుండా చిత్ర దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కాగా, యాక్షన్‌ ఎపిసోడ్స్‌తోపాటు భారీ షెడ్యూల్‌ని యూరప్‌లో చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది. 2021లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 40 రోజుల భారీ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. బడ్జెట్‌ పరంగా టీవ్‌ు రాజీ పడిందనే ప్రచారం నేపథ్యంలో తాజాగా యువీ సంస్థ ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో టెక్నీషియన్స్‌ని ఉపయోగించి యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నామనే ప్రకటనతో.. ఒక్కసారిగా ప్రభాస్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహం షురూ అయ్యింది. ప్రభాస్‌ సినిమా అంటే.. ఆటోమేటిక్‌గా అంచనాలు ఆకాశాన్నంటేస్తాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS