ఆర్జీవీకి మరో ‘సంచలనం’ దొరికినట్లేనా?

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ప్రస్తుతం ‘దిశ’ సినిమా పనుల్లో బిజీగా వున్న విషయం విదితమే. తాజాగా ఆర్జీవీ నుంచి మరో సంచలనాత్మక సినిమా రాబోతోందా.? అన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘ప్రణయ్‌ హత్య’ ఘటనపై రామ్ గోపాల్‌ వర్మ మాత్రమే సినిమా తీయగలడని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సంచలనాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ముందుగా ఆర్జీవీ పేరే అందరికీ గుర్తుకొస్తుంటుంది.

 

తన కుమార్తె, వేరే కులానికి చెందిన కుర్రాడిని పెళ్ళి చేసుకుందన్న అక్కసుతో, ఓ తండ్రి తన కుమార్తె భర్తను దారుణంగా చంపేయించిన కథతో ఎన్నో సినిమాలొచ్చినా.. ‘ప్రణయ్‌ - అమృత - మారుతీరావు’ అన్నిటికన్నా చాలా చాలా ప్రత్యేకమైనది. తాజాగా మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో, ఈ ఘటన మరోమారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దాంతో, వర్మ మాత్రమే ఈ ఘటనపై సరైన సినిమా తీయగలడని భావిస్తున్నారంతా. అయితే, వర్మ తనకంటూ ఓ ఖచ్చితమైన ఆలోచనలుండే వ్యక్తి. ఎవరి ఆలోచనల పట్లా ఆయన ప్రభావితమయ్యే అవకాశం వుండదు. ‘దిశ’ విషయంలో ఆయన సినిమా తీయాలనుకోవడానికి కారణాలు చాలానే వున్నాయి. మరి, అలాంటి బలమైన కారణాలు ‘ప్రణయ్‌ హత్య - మారుతీరావు ఆత్మహత్య’ ఘటనలో ఆర్జీవీకి దొరుకుతాయా.? దొరికితే మాత్రం, ఆయన్నుంచి ఖచ్చితంగా మనం సినిమా ఆశించొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS