కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన ప్రభాస్

మరిన్ని వార్తలు

ప్రభాస్తో సినిమాలు చేయాలని చాలా మంది డైరెక్టర్లు ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా చాలా మంది డైరెక్టర్లు ప్రభాస్తో పని చేయాలని చూస్తున్నారు. అయితే, ఆ ఛాన్స్‌ ‘మహానటి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ దక్కించుకున్నాడు. ‘మహానటి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ఈ దర్శకుడు ఇంతవరకూ మరో సినిమా చేయలేదు. లేటెస్ట్‌గా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ నుండి నాగ అశ్విన్‌ ` ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించారు. ‘మహానటి’ వంటి క్రిటికల్‌ ప్రాజెక్ట్‌ని టచ్‌ చేసి, దాన్ని క్లాసిక్‌ మూవీలా మలచిన ఘనత నాగ అశ్విన్‌ది. మంచి విషయమున్న దర్శకుడు. ఇలాంటి విషయమున్న డైరెక్టర్‌ చేతికి ప్రభాస్ వంటి స్టార్‌ హీరో చిక్కితే ఆ ప్రాజెక్ట్‌ రూపం ఎలా ఉండబోతోందో ఊహించడమే కష్టం.

 

అయితే, ప్రభాస్ కోసం నాగ అశ్విన్‌ ఓ ఊర మాస్‌ కథని సిద్ధం చేశాడని తెలుస్తోంది. ‘మహానటి’ తర్వాత నాగ అశ్విన్‌ ఈ స్క్రిప్ట్‌ పైనే వర్క్‌ చేశాడట. రీసెంట్‌గా స్క్రిప్టు వర్క్‌ పూర్తి చేసుకుని ప్రభాస్కి స్టోరీ లైన్‌ వినిపించగా, ఇంప్రెస్‌ అయిన ప్రభాస్ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. దాంతో ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా క్షణం కూడా లేట్‌ చేయకుండా, వైజయంతీ బ్యానర్‌ వారు వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమాని అనౌన్స్‌ చేసేశారు. వైజయంతీ మూవీ బ్యానర్‌లో అశ్వనీదత్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ తదితర వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలో నటిస్తున్నారు. ‘రాధే శ్యామ్‌’ అనే టైటిల్‌ ఈ సినిమాకి వినిపిస్తోంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS