విదేశాల నుంచి ఎవరొచ్చినా స్వీయ నిర్బంధంలో 14 రోజుల పాటు వుండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రపంచాన్ని ‘కోవిడ్ వైరస్’ వణికిస్తున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. విమానం దిగీ దిగగానే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అనుమానితుల్ని అట్నుంచటే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అనుమానిత లక్షణాలు లేని వారికి మాత్రం ఇంటికి పంపించేస్తున్నారుగానీ, వారు తమంతట తాముగా క్వారంటైన్లో వుండాల్సి వస్తుంది. అంటే, ఇతరులను కలవకపోవడం.. బయటకు వెళ్ళకపోవడం.. మాస్క్లు ధరించడం వంటివన్నమాట.
So I made a choice, I will be at home for next 14 days before giving myself a clean chit.
— Priyadarshi (@priyadarshi_i) March 17, 2020
Because #SocialDistancing is the need of the hour.
Let's not panic but let's just be cautious and considerate towards each other's wellbeing.#COVID2019 #SocialDistancingWorks pic.twitter.com/furHSFrrdA
అసలు విషయానికొస్తే, కమెడియన్ ప్రియదర్శి, ఇటీవలే జార్జియాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. తాను సెల్ఫ్ క్వారంటైన్లో వుంటాననీ, 14 రోజులపాటు బయటకు వచ్చే ఛాన్సే లేదని వెల్లడించాడు ప్రియదర్శి. సెలబ్రిటీలు ఇలా చేసే ప్రచారం సమాజంలో అవగాహనను పెంచుతుంది. ప్రియదర్శి మాత్రమే కాదు, ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే.. కరోనా వైరస్ని తేలిగ్గా తరిమికొట్టడానికి ఆస్కారమేర్పడుతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇటీవల జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం విదితమే. ప్రభాస్, పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్లు. మొత్తం యూనిట్ అంతా సెల్ఫ్ క్వారంటైన్లో వుండాల్సి వస్తుంది. ఎందుకంటే, జార్జియా కూడా కరోనా వైరస్ ప్రభావిత దేశమే.