ఇది క్లియర్‌: పవన్‌ కళ్యాణ్‌ వచ్చేస్తున్నాడు.!

మరిన్ని వార్తలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, మళ్ళీ సినిమాల్లో నటించబోతున్నాడు. నిర్మాత దిల్‌ రాజు ఈ విషయాన్ని ఖరారు చేశారు. సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న 'ప్రతి రోజూ పండగే' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా, పవన్‌ అభిమానులకి తీపి కబురు చెప్పాడు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు. ఇప్పటిదాకా 'పింక్‌' రీమేక్‌పై కాస్తో కూస్తో వున్న సస్పెన్స్‌, దిల్‌ రాజు ప్రకటనతో తొలగిపోయింది. 'పింక్‌' రీమేక్‌ షూటింగ్‌కి పవన్‌ కళ్యాణ్‌ హాజరు కావడమే తరువాయి.! తన 20 ఏళ్ళ కల నెరవేరుతోందంటూ దిల్‌ రాజు చేసిన ప్రకటనతో పవన్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమైపోయిన పవన్‌ కళ్యాణ్‌, తాను తిరిగి సినిమాల్లో నటించబోనని ప్రకటించిన విషయం విదితమే. అయితే, దిల్‌ రాజుతోపాటు బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఒప్పించడంతో పవన్‌, 'పింక్‌' రీమేక్‌లో నటించడానికి ఒప్పుకున్నారు.

 

బాలీవుడ్‌ 'పింక్‌'లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడ ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక, తమిళంలో అజిత్‌ హీరోగా నటించాడు ఈ సినిమాలో. 'నేర్కొండ పార్వయ్‌' పేరుతో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో కన్పించింది. తెలుగు వెర్షన్‌ కోసం నివేదా థామస్‌ని అనుకుంటున్నారట. అంజలి పేరు కూడా విన్పిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS