ఏదైనా ఓ మాట మాట్లాడేటప్పుడు, ఒకర్ని విమర్శించేటప్పుడు ఆచి తూచి ఆలోచించాలి. మైకు ఉంది కదా, అని ఏది పడితే అది మాట్లాడేస్తే చిక్కులు తప్పవు. ఈ విషయం రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్కి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఈమధ్య తమిళ నిర్మాతలపై ధనుష్ కొన్ని కామెంట్లు చేశాడు.
పారితోషికం ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతుంటారని, సినిమా అయిపోయినా హీరోలకు పారితోషికం ఇవ్వరని, చాలామంది నిర్మాతలు తనకు డబ్బులు ఎగ్గొట్టారని కొన్ని ఘాటైన కామెంట్లు చేశాడు ధనుష్. దాంతో కొంతమంది తమిళ నిర్మాతలు ధనుష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుష్తో సినిమాలు చేసిన ఏ నిర్మాతకూ లాభాలు రాలేదని, చాలామంది ఆస్తుల్ని అమ్ముకుని రోడ్డెక్కారని, కొంతమంది సినీ పరిశ్రమకే దూరం అయ్యారని ధనుష్పై ఫైర్ అవుతున్నారు.
అంతేకాదు.. ధనుష్ సమయానికి సెట్ కి రాడని, ధనుష్ బద్దకం వల్ల, సినిమాలు ఆలస్యం అవుతున్నాయని, దాంతో బడ్జెట్లు పెరిగిపోతున్నాయని, అందుకే ధనుష్తో సినిమా చేయడానికి నిర్మాతలంతా ఆలోచిస్తున్నారని ధనుష్పై రివర్స్ అవుతున్నారు. ధనుష్కి వ్యతిరేకంగా తమిళ నాట ఓ వర్గం తయారవుతోందిప్పుడు. దాంతో అనవసరంగా నిర్మాతల జోలికివెళ్లానని ధనుష్ ఫీలవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.