కొడుకు కోసం ‘మెహబూబా’ అంటున్న పూరి

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించి-దర్శకత్వం వహించే బాధ్యతని తన పైనే వేసుకున్నాడు పూరి.

ఇక ఈ చిత్రం 1971 సమయంలో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపధ్యంలో సాగే ఒక ప్రేమకథ అని ఫస్ట్ లుక్ తో పాటే ఒక చిన్న ముందుమాట కూడా చెప్పడం జరిగింది. ఇదిలావుంటే ఈ ‘మెహబూబా’ చిత్రాన్ని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్ లలో తెరకెక్కించనున్నట్టు తెలిపారు.

మెహబూబాలో ఆకాష్ పూరి సరసన నేహా శెట్టి అనే అమ్మాయి నటిస్తున్నది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఈ ప్రేమకథకి స్వరాలు సమకూర్చనున్నాడు.

చాలా మంది హీరోలకి హిట్ చిత్రాలు అందించిన పూరి మరి తన కొడుకుకి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో అన్నది వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS