బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి, తుపాన్గా మారడంతో, 'రాగల 24 గంటల్లో' తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అందించే న్యూస్లో 'రాగల 24 గంటల్లో' అనే మాట అందరి నోట్లోనూ చాక్లెట్లా చప్పరించబడిపోయింది. అంత అలవాటైన ఈ మాటని టైటిల్గా పెట్టి ఓ థ్రిల్లర్ సినిమా తెరకెక్కించేస్తున్నారు. అవునండీ సినిమా పేరే 'రాగల 24 గంటల్లో'.
ఈ థ్రిల్లర్ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనుకోకండి. ఈయన వేరు.. డైరెక్టరు. గతంలో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారులెండి. నిర్మాతగా శ్రీనివాస్ కానూరు అనే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్లుక్ విడుదల చేశారు. ఆ లుక్లో ఏముందంటే, ఓ అమ్మాయి రెండు కాళ్లు.. రక్తంలో నడుచుకుంటూ వెళుతోంది.. కాళ్లు మాత్రమే వెనక నుండి చూపించారు.. అంతే ఈ ఫస్ట్లుక్.
ఇక తారాగణం విషయానికి వస్తే, తెలుగమ్మాయ్ ఈషా రెబ్బ, బాలయ్యతో 'పైసా వసూల్'లో హీరోయిన్గా నటించిన ముస్కాన్ సేథి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నటుడు సత్యదేవ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. రఘు కుంచె మ్యూజిక్ అందిస్తున్నాడు. అదీ సంగతి. థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తున్న ఈ తరుణంలో 'రాగల 24 గంటల్లో' సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో చూడాలి మరి.