శర్వానంద్ కు జోడీగా ఆ హీరోయిన్ ఫిక్స్

మరిన్ని వార్తలు

యువదర్శకుడు అజయ్ భూపతి తన తొలి సినిమా 'RX100' తో సంచలన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే రెండవ సినిమా మాత్రం ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. ఈమధ్యే ఈ ఇద్దరు హీరోల మల్టిస్టారర్ కు హీరోలు సెట్ అయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్ లు ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

'మహా సముద్రం' టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. కథ నచ్చడంతో పాటుగా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉండడంతో సినిమాలో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్ల ఎంపిక కూడా జరుగుతోందని, త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

 

మొదటి సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న రెండో సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అంతే కాదు సినిమా పరిశ్రమలో చాలామందికి రెండో సినిమా గండం ఉంటుంది. అది తప్పించుకోగలడా లేదా అనేది కూడా ఆసక్తికరం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS