మంగళవారం తెల్లవారుజామున షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా, నార్సింగిలోని అల్కాపూర్ వద్ద డివైడర్ని ఢీకొని యంగ్ హీరో రాజ్తరుణ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి గురైంది. ఈ ఘటనలో రాజ్తరుణ్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. అయితే, ఘటన అనంతరం రాజ్తరుణ్ తన కారును అక్కడే వదిలేసి, పరుగెడుతూ పారిపోతున్న సీసీ టీవీ పుటేజ్ మీడియాకి చిక్కడంతో, ఆ సిట్యువేషన్ని ఆసరాగా తీసుకుని, రకరకాల కథనాలు వెలువడ్డాయి.
యాక్సిడెంట్ చేసి పరారైన రాజ్తరుణ్.. మధ్యం సేవించి ఉండడంతో కేసు అవుతుందని భయపడిన రాజ్తరుణ్, అజ్ఞాతంలో రాజ్తరుణ్.. అంటూ రకరకాల వార్తలు వెలువడడంతో, తాజాగా రాజ్తరుణ్ సోషల్ మీడియాలో స్పందించాడు. సడెన్ టర్నింగ్ ఉండడంతో, కారు అదుపు తప్పి, డివైడర్ని ఢీకొట్టిందనీ, ఆ సిట్యువేషన్లో ఏం చేయాలో తోచక కంగారు పడి, ఇల్లు అక్కడికి దగ్గరలోనే ఉండడంతో, పరుగు పెట్టాననీ చెప్పాడు. యాక్సిడెంట్ సయమంలో తాను సీట్ బెల్టు ధరించడంతో ప్రాణాపాయం తప్పిందన్నాడు. ఈ యాక్సిడెంట్ విషయమై కంగారుపడుతూ, తనకు ఫోన్లు చేసిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
నేను బాగానే ఉన్నాను.. అందరికీ థాంక్స్ అని డీటెయిల్డ్గా రాజ్తరుణ్ పెట్టిన పోస్ట్తో ఆయనపై వస్తున్న అనవసర ఊహాగానాలు, గాలి వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ 'ఇద్దరిదీ ఒకటే లోకం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని వస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కారణంగా కొంత షాక్లోకి వెళ్లిన రాజ్ తరుణ్ తేరుకుని, త్వరలోనే షూటింగ్కి హాజరు కానున్నాడనీ సమాచారమ్.