ఇద్దరు భామల మధ్యన 'బుజ్జిగాడు'

మరిన్ని వార్తలు

డబుల్‌ హ్యాట్రిక్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించి, సడెన్‌గా కెరీర్‌ని డల్‌ మోడ్‌లో పడేసుకున్న హీరో రాజ్‌తరుణ్‌. రాజ్‌ తరుణ్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలంటే, ఓ క్రేజీ హిట్‌ అతని ఖాతాలో పడాల్సిందే. అది 'ఒరేయ్‌ బుజ్జిగా..' తో సాధ్యమవుతుందా.? అంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఒరేయ్‌ బుజ్జిగా'. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని విజయ్‌.ఎస్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రాజ్‌ తరుణ్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతున్నాడు.

 

రాజ్‌ తరుణ్‌తో ఆల్రెడీ రెండు సార్లు జత కట్టిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ ఒకరు కాగా, 'కళ్యాణ వైభోగమే' ఫేమ్‌ మాళవికా నాయర్‌ ఇంకొకరు. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌ హిట్‌ కొడతాడనే నమ్మకం వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్‌. సెట్స్‌ మీదికెళ్లకుండానే ఈ సినిమాపై ఇంతటి నమ్మకం వ్యక్తం చేయడానికి కారణం స్క్రిప్టే అంటున్నారు. ఈ తరం యువతను ఉర్రూతలూగించేలా, హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీని ఈ సినిమాలో చూపించబోతున్నారట. అన్నట్లు ఈ లోగానే రాజ్‌ తరుణ్‌ 'ఇద్దరి లోకం ఒకటే' మూవీ రిలీజ్‌కి రెడీగా ఉందండోయ్‌.

 

రాజ్‌ తరుణ్‌ - షాలినీ పాండే జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిశంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌తరుణ్‌కి ఈ డేట్‌ అంటే చాలా ఇష్టమట. తనకిష్టమైన డేట్‌కి రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టి చూపిస్తాడేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS