కొత్త సినిమా షురూ చేసిన రాజ్‌తరుణ్‌!

మరిన్ని వార్తలు

'ఉయ్యాలా జంపాలా' సినిమాతో కెరీర్‌ స్టార్ట్‌ చేసి, వరుస విజయాలతో కొద్ది కాలంలోనే డబుల్‌ హ్యాట్రిక్‌ హీరో అనిపించుకున్నాడు రాజ్‌తరుణ్‌. అయితే, రాజ్‌తరుణ్‌కి ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. చేసిన ప్రతీ సినిమా నిరాశపరిచింది. దాంతో రేస్‌లో బాగా వెనకబడిపోయాడు. లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని మళ్లీ జోరందుకున్నాడీ యంగ్‌ హీరో. ఏకకాలంలో రెండు సినిమాలను స్టార్ట్‌ చేసేశాడు. ఆల్రెడీ దిల్‌ రాజు బ్యానర్‌లో 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాని ఇటీవలే లాంఛ్‌ చేశాడు. జి.ఆర్‌.కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు.

 

ఇదిలా ఉంటే, తాజాగా మరో చిత్రాన్నీ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు రాజ్‌తరుణ్‌. అదే కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఈ రోజు లాంఛనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్‌ అయ్యింది. సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌లో కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాతో యంగ్‌ హీరో నితిన్‌కి మంచి సక్సెస్‌ ఇచ్చిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌, రాజ్‌తరుణ్‌ కోసం గత మూడేళ్లుగా ఈ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడట.

 

ఇన్నాళ్లకు రాధా మోహన్‌ నిర్మాణంలో ఈ స్క్రిప్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంతో రాజ్‌తరుణ్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS