అమరావతికి రాజమౌళి మెరుగులు

మరిన్ని వార్తలు

రాజధాని అమరావతికి సంబంధించి, దేశం కీర్తించిన డైరెక్టర్‌ రాజమౌళి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకోసం రాజమౌళిని తమ వద్దకు పిలిపించారు చంద్రబాబు. ఈ రోజు రాజమౌళి - చంద్రబాబును కలిశారు. నార్మల్‌ ఫోస్టర్స్‌ అనే లండన్‌కి చెందిన కంపెనీ రాజధాని కోసం కొన్ని ప్రత్యేక డిజైన్లను రూపొందించింది. వాటిలో కొన్ని ఫ్రంట్‌ డిజైన్స్‌ పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఆ డిజైన్స్‌ని రాజమౌళికి చూపించి వాటిని మన సంస్కృతీ సాంప్రదాయాలకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయమని ఆదేశించారు. అందుకు రాజమౌళి సానుకూలంగా స్పందించారు. ఈ డిజైన్స్‌ నేపథ్యంలో చంద్రబాబు త్వరలోనే లండన్‌ వెళ్లనున్నారు. అప్పుడు తనతో పాటు రాజమౌళిని కూడా తీసుకెళ్లనున్నారు. 'మగధీర' కోసం 'ఉదయ్‌ఘడ్‌' సామ్రాజ్యాన్ని, 'బాహుబలి' కోసం 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని సెట్స్‌గా వేయించారు రాజమౌళి. ఆ సెట్స్‌ ఎప్పటికీ ప్రత్యేకమైనవే. తెలుగు సినీ పరిశ్రమలో న భూతో న భవిష్యతి అనే స్థాయిలో వేసిన సెట్స్‌ అవి. వాటిని చూసి, మెచ్చిన చంద్రబాబు ఆ రకంగా నూతన రాజధాని నిర్మాణాలు వుండాలని కోరుకున్నారు. ఆయన కోరిక ప్రకారం రాజధాని నిర్మాణంలో రాజమౌళికి తన సలహాలనందించే అరుదైన అవకాశాన్ని అందించారు. రాజమౌళి సూచనల మేరకు అమరావతి ఎంత అద్భుతమైన మెరుగులు దిద్దుకోనుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS