రాజశేఖర్ నటించిన ‘అర్జున’ సినిమాకి వాయిదాల పర్వం ఇంకా తీరినట్లు లేదు. ఎప్పుడో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాని ఈ మధ్య చాలా సార్లే రిలీజ్కి ప్లాన్ చేశారు. గతంలో రెండు, మూడు సార్లు రిలీజ్కి ప్లాన్ చేసి, భంగపడ్డారు. వెనక్కి తగ్గారు. తగ్గుతూనే ఉన్నారు. ఇక రీసెంట్గా ఈ రోజు ‘అర్జున’ను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, రిలీజ్కి ఒక్క రోజు ముందే మళ్లీ ఈ సినిమా పోస్ట్పోన్ న్యూస్ బయటికి వచ్చింది. ఇంతకీ ఈ సారి పోస్ట్పోన్కి ఏ వంక దొరికిందా.? అనుకుంటున్నారా.? ప్రపంచాన్ని గడగడలాడిరచేస్తోన్న కరోనా వైరస్. పాపం ఇప్పుడు రాజశేఖర్ సినిమానీ దెబ్బ కొట్టేసింది.
కరోనా కారణంగా ‘అర్జున’ సినిమాని ఓ ‘వారం’ రోజుల పాటు పోస్ట్పోన్ చేస్తున్నామంటూ నిర్మాత నట్టికుమార్ ప్రకటించారు. కామెడీగా లేదూ. కరోనా కారణంగా ఓ రెండు, మూడు నెలలు వాయిదా వేశామంటే అదో లెక్క కానీ, నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసేదానికి కరోనా కారణం వెతుక్కోవడమేంటీ.? కామెడీగా.. అని నెటిజన్లు డబుల్ మీనింగ్స్ తీస్తున్నారు. అయినా, తాను నటించిన ‘అర్జున’ అనే మూవీ ఒకటి రిలీజ్కి ఉందన్న సంగతి రాజశేఖరే మర్చిపోయారు. బొత్తిగా పట్టించుకోవడమే మానేశారాయన. పాపం నిర్మాతలే తాపత్రయపడుతున్నారు. ఇదిలా ఉంటే, సినిమాలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే ఉందని చెప్పాలి. ఏకంగా కరోనా దెబ్బకి జేమ్స్ ‘బాండ్’ మూవీనే పోస్ట్పోన్ చేసిన సంగతి తెలిసిందే.