ఎవ‌డో మూర్ఖుడు రాశాడు: రాజేంద్ర‌ప్ర‌సాద్ ఫైర్‌

By iQlikMovies - July 01, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

ఓ బేబీ సెట్లోకి రాజేంద్ర‌ప్ర‌సాద్ తాగి వ‌చ్చార‌ని, సెట్లో కూడా ఆయ‌న మ‌ద్యం తారార‌ని ఈమ‌ధ్య వార్త‌లొచ్చాయి. వాటిపై న‌ట‌కిరీటి ఫైర్ అయ్యారు. ఓ బేబీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లోనే త‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. తాను మ‌ద్యం తాగ‌లేద‌ని ఓ మూర్ఖుడు అలా రాశాడ‌ని వ్యాఖ్యానించారు. ‘నేను చదువుకున్న నటుడిని. నేను సీనియర్‌ ఎన్టీఆర్‌లాగా పాత్రలో లీనమైపోయి నటిస్తుంటాను. ఎందుకంటే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే.

 

ఆయన ఓ పాత్రలో నటిస్తున్నప్పుడు ఇంటికి వెళ్లేవరకు అదే పాత్రలో లీనమైపోయి ఉంటారు. బహుశా నాకూ అదే అలవడినట్లుంది. ఈ నేపథ్యంలో ‘ఓ బేబీ’ సినిమాలో తాగినట్లు నటించాల్సిన సన్నివేశం ఒకటి వచ్చింది. ఇందుకోసం నేను షాట్‌ రెడీ అని చెప్పడానికి ముందే మద్యం సేవించినట్లుగా నటించాను. దీనిపై ఎవడో మూర్ఖుడు తప్పుగా రాశాడు.

 

విషయం తెలుసుకోకుండా అలా చేశాడు.. అది వాడి ఖర్మ. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా నటన వల్ల సెట్లోని ఎవ్వరికీ ఇబ్బందికలగలేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్‌. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ఓ బేబీ`లో రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర పోషించారు. ఈనెల 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS