రజనీకాంత్ - రాజకీయాలు అనే హాట్ టాపిక్ ఎప్పటి నుంచో రగులుతూనే ఉంది. రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయం. కానీ అదెప్పుడన్నదీ అంతు పట్టడం లేదు. రజనీకాంత్ బిజేబీతో చేతులు కలుపుతారని, తమిళనాడులో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. తమిళనాట బీజేపీ పగ్గాల్ని రజనీకి అప్పగించాడనికి భారీ ఎత్తున కసరత్తులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అయితే రజనీ మాత్రం బీజేపీతో చేతులు కలపడానికి ఇష్టపడడం లేదని టాక్. ప్రస్తుతం రజనీ `దర్బార్` అనే సినిమాతో బీజీగా ఉన్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తరవాత రజనీ పూర్తి స్థాయి రాజకీయాల్లో వస్తారని తెలుస్తోంది.
2020 సంక్రాంతి సందర్భంగా రజనీ తన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని, ఆయన సోలోగానే తన పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయని, ఆయన బీజేపీతో ఏమాత్రం కలవరని రజనీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సో.. రజనీ రాకకు ముహూర్తం ఫిక్సయిపోయినట్టే అన్నమాట.