రాజుగారి గది 3' మొదలెట్టేశారహో!

By iQlikMovies - June 20, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

కొత్త నటీనటులతో తెరకెక్కించిన 'రాజుగారి గది' మంచి విజయం అందుకుంది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌ కొట్టిన సినిమాగా అప్పట్లో 'రాజుగారి గది' టాక్‌లో నిలిచింది. బుల్లితెర యాంకర్‌ ఓంకార్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో దానికి సీక్వెల్‌ తెరకెక్కించాడు. సీక్వెల్‌లో నాగార్జున వంటి స్టార్‌ హీరో సపోర్ట్‌ లభించింది. అప్పటికే హీరోయిన్‌గా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సమంత గ్లామర్‌ కూడా యాడ్‌ అయ్యింది.

 

అయితే, స్టార్‌ కాస్టింగ్‌ పెరిగింది కానీ, 'రాజుగారి గది 2' ఆశించిన విధంగా కాసులు రాల్చలేదు. దాంతో కొంచెం స్లో అయినట్లు కనిపించాడు ఓంకార్‌. కానీ, కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్‌ రూపొందిస్తున్నాడు. అదే 'రాజుగారి గది 3'. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమైందిప్పుడు. ఈ రోజు లాంఛనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

 

దిల్‌ రాజు ఫస్ట్‌ షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తొలి రెండు భాగాల్లోనూ నటించిన అశ్విన్‌ ఈ పార్ట్‌లో కూడా నటిస్తున్నాడు. అయితే, కథ విషయానికి వచ్చేసరికి పూర్తిగా లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీగా ఈ సీక్వెల్‌ని మలచబోతున్నాడట ఓంకార్‌. అంటే తమన్నా చుట్టూనే పూర్తిగా ఈ కథ తిరుగుతుందన్న మాట. త్వరలో రెగ్యులర్‌ షూట్‌ జరగనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS