అయ్యో రాఖీ ఇలా జరిగిందేంటీ.!

మరిన్ని వార్తలు

ఏదో ఒక సెన్సేషన్‌తో వార్తల్లో నిలిచే రాఖీసావంత్‌ ఈ మధ్య 'మీ టూ' ఉద్యమం పేరు చెప్పి చేసిన హల్‌ చల్‌ అంతా ఇంతా కాదు, నటి తనూశ్రీ దత్తా, నానా పటేకర్‌పై చేసిన ఆరోపణలు నిజం కావంటూ వాదిస్తూ, ఆ మూమెంట్‌ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్లి, చివరికి అదో పనికి మాలిన ఉద్యమం అని కొట్టి పారేసింది. 

సీన్‌ కట్‌ చేస్తే, 'మీ టూ' సంగతి సరే.. ప్రస్తుతం రాఖీ సావంత్‌ ఏం చేస్తోందా.? అంటే నడుం విరగ్గొట్టుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అదేంటీ ఏమైందీ.? అనుకుంటున్నారా? నోటి దూల కొంచెం ఎక్కువే రాఖీ సావంత్‌కి. 'మీ టూ' ఉద్యమంతో పాటు, గతంలోనూ పలు సంఘటనల్లో ఆ విషయం ప్రూవ్‌ అయ్యింది. అయితే తాజాగా ఆమె నోటి దూల పైత్యం ఆమెను ఆసుపత్రి పాలు చేసిందంటే అర్ధం చేసుకోండి ఆ ఎఫెక్ట్‌ ఎంత గట్టిగా కొట్టిందో. సర్లే అసలు విషయానికొచ్దేద్దాం. హర్యానాలోని పంచకులలో కాంటినెంటల్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోటీల సందర్భంగా జరిగిన ఘటనే ఆమె నోటి దూల గురించి జనం మరోసారి హాట్‌హాట్‌గా మాట్లాడుకునేలా చేసింది. 

అక్కడ పోటీలో పాల్గొనే ఓ రెజ్లర్‌తో రాఖీసావంత్‌ ఛాలెంజ్‌ చేసింది. ట్రెయిన్డ్‌ రెజ్లర్‌తో ఛాలెంజ్‌ చేస్తే అలాగే ఉంటుంది మరి. తనకే సవాల్‌ విసిరి బరిలో దిగిన రాఖీసావంత్‌ని ఒక్క షాట్‌లోనే ఎత్తి నేలకేసి కొట్టింది ఆ రెజ్లర్‌. ఇంకేముంది రాఖీ నడుం విరిగిందంతే. మొదట్లో యాక్టింగ్‌ చేస్తుందనుకున్న అధికారులు విషయాన్ని గ్రహించి రాఖీసావంత్‌ని ఆసుపత్రికి తరలించారు. 

చికిత్సానంతరం రాఖీ మీడియాతో మాట్లాడుతూ ఇది నిజంగా నిజం. పబ్లిసిటీ స్టంట్‌ ఏమాత్రం కాదని భావోద్వేగానికి లోనైంది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అవుతూ అమ్మని చూడాలనుందని చెప్పింది రాఖీ సావంత్‌. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS