ఆ హీరోయిన్‌ లెస్బియన్‌.?

మరిన్ని వార్తలు

'మీ..టూ..' ఉదంతంతో పాపులర్‌ అయిన బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తాపై 'లెస్బియన్‌' ఆరోపణలు చేసింది ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌. నటుడు నానా పటేకర్‌పై 'లైంగిక వేధింపుల' ఆరోపణలతో తనూశ్రీ దత్తా లైమ్‌లైట్‌లోకి వచ్చిన సంగతి తెల్సిందే. 

ఈ బ్యూటీ, అందాల పోటీలు - మోడలింగ్‌ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో బాలకృష్ణ సరసన ఓ సినిమాలో కూడా నటించింది తనూశ్రీ దత్తా. ఓ బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా, ఓ పాట చిత్రీకరణ సందర్భంగా నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడన్నది తనూశ్రీ దత్తా ఆరోపణ. ఈ పాటని నానా పటేకర్‌ వేధింపులు భరించలేక వదులుకుంది తనూశ్రీ. అయితే తనూశ్రీ ప్లేస్‌లోకి వచ్చిన రాఖీ సావంత్‌, ఆ సాంగ్‌ని కంప్లీట్‌ చేసింది. 

తనూశ్రీ అప్పటినుంచి ఇప్పటిదాకా కోమాలోకి వెళ్ళిపోయిందేమోనంటూ నానా పటేకర్‌ని వెనకేసుకొస్తూ రాఖీ సావంత్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తే, రాఖీ సావంత్‌కి తనూశ్రీ దత్తా లీగల్‌ నోటీసులు పంపింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. ఇప్పుడు రాఖీ సావంత్‌, తనూశ్రీదత్తాపై డ్రగ్స్‌ ఆరోపణలు మాత్రమే కాదు, లెస్బియన్‌ ఆరోపణలు కూడా చేసింది. తనూశ్రీ దత్తా లెస్బియన్‌ అనీ, చాలా మంది అమ్మాయిల్ని ఆమె సెక్సువల్‌ వేధింపులకు గురిచేసిందని రాఖీ సావంత్‌ ఆరోపించడం సంచలనంగా మారింది. 

నిజానికి రాఖీ సావంత్‌ ఏదైనా మాట్లాడగలదు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెకి కొత్త కాదు. ఆమెతో పెట్టుకుంటే ఎవరయినా ఇలాగే సిగ్గేపడేలా చేసేస్తుంది. 'దిగజారుడుతనానికి పరాకాష్ట' అనే అంటుంటారు రాఖీ సావంత్‌ గురించి బాలీవుడ్‌లో ఎవరైనా. మరి రాఖీ సావంత్‌ వ్యాఖ్యలపై తనూశ్రీ ఎలా స్పందిస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS