బోయపాటి సినిమాల్లో గ్లామర్ కొంచెం ఎక్కువే అని చెప్పాలి. హీరోయిన్ గ్లామర్తో పాటు, ఎక్స్ట్రా క్యారెక్టర్స్తోనూ గ్లామర్ పండిస్తుంటాడు బోయపాటి శీను. ఐటెం సాంగ్స్ కూడా అంతే, ఒకటి, వీలైతే అంతకన్నా ఎక్కువే ప్రిఫర్ చేస్తాడు. ఆ కోవలో ప్రస్తుతం బోయపాటి శీను, మెగా పవర్ స్టార్ రామ్చరణ్తో చేయబోతున్న సినిమా కోసం రెండు స్పెషల్ సాంగ్స్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్పెషల్ సాంగ్స్ కోసం ఇద్దరు పాపులర్ హీరోయిన్స్ని సంప్రదించాడట బోయపాటి శీను. వారిలో రకుల్ ప్రీత్సింగ్, మిల్కీ బ్యూటీ తమన్నా పేర్లు వినిపిస్తున్నాయి. చరణ్తో రకుల్ ఐటెం సాంగ్ అంటూ గత కొంతకాలంగా గాసిప్స్ వినవస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రకుల్ హవా తగ్గిందనే చెప్పాలి. అయితే చరణ్ సినిమాతోనే రకుల్ టాలీవుడ్లో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతోందనీ ఫిల్మ్ నగర్ టాక్. అలాగే చరణ్తో డాన్సుల్లో సమఉజ్జీ అయిన ముద్దుగుమ్మ తమన్నాతోనూ ఈ సినిమాలో ఓ సాంగ్ ఉందనే ప్రచారం కూడా ఈ మధ్య జోరందుకుంది.
అయితే ఒకే ఐటెం సాంగ్, ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అంటూ మరోవైపు టాక్ వినిపిస్తోంది. అయితే చరణ్ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఎట్ ఏ టైం ఐటెం సాంగ్లో స్టెప్పులిరగదీస్తాడా? లేక చెరొకటి చొప్పున రెండు సాంగ్స్తో మాస్ స్టెప్పులు అదరగొడతాడా ? అనేది చూడాలి మరి.
ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్గా 'భరత్' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్గా కనిపించనున్నాడు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.