రకుల్‌ జోరు పెరుగుతుందా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఒక్కసారి బాలీవుడ్‌లో అడుగు పెట్టాక, తెలుగులో అంతవరకూ ఉన్న తన స్టార్‌డమ్‌ ఉనికిని సడెన్‌గా కోల్పోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగులో రకుల్‌ జోరు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. 

అయితే హీరోయిన్‌గా పూర్తి స్థాయిలో రకుల్‌కి అవకాశాలు రావట్లేదనే చెప్పాలి. ఏదో ఒకటి రెండు చిత్రాల్లో రకుల్‌ నటిస్తోందట అనే టాక్‌ తప్ప అవన్నీ అఫీషియల్‌ క్లారిటీలు కావు. తాజాగా రకుల్‌ మరో బిగ్‌ ప్రాజెక్ట్‌లోనూ చోటు దక్కించుకుందంటూ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ అందుతున్నాయి. వెంకటేష్‌ - నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్‌లో రకుల్‌ నటిస్తోందట. 

చైతూతో రకుల్‌ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో నటించింది. ఈ సినిమాతో చైతూకు మంచి హిట్‌ దక్కింది. అందుకు కారణం తన భ్రమరాంబే అదే, రకుల్‌ ప్రీత్‌సింగేనని చైతూ నమ్ముతున్నాడు. ఆ సినిమా నాటికి తెలుగులో రకుల్‌ హవా కొనసాగుతోంది. రకుల్‌ స్టార్‌డమ్‌ ఆ సినిమాని సక్సెస్‌ దిశగా పరుగులు పెట్టించింది. అది మనసులో పెట్టుకున్నాడు కాబట్టే, చైతూ రకుల్‌కి తన సినిమాలో ఛాన్స్‌ ఇచ్చాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అసలింతకీ ఈ సినిమాలో రకుల్‌ హీరోయినా? లేక గెస్ట్‌ రోల్‌నా? అనేది క్లారిటీ లేదు. చూడాలి మరి, వినిపిస్తున్న ప్రచారం నిజమై ఉంటే, రకుల్‌ చేతిలో ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలున్నట్లే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS