తూచ్‌.! మా మధ్య అలాంటివేం లేవ్‌!

మరిన్ని వార్తలు

ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే, వారి మధ్య ఏవో విబేధాలున్నాయంటూ పుకార్లు షికారు చేయడం మామూలే. అందులోనూ పుకార్లకు కేరాఫ్‌ ఆడ్రస్‌గా నిలిచిన ముద్దుగుమ్మలైతే, ఏదో ఒక లింకు పెట్టి, వారి మధ్య సోషల్‌ గొడవలు ఇట్టే పుట్టించేస్తుంటారు కొందరు ఆకతాయి నెటిజన్లు. అలాగే ఇప్పుడు సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై కూడా పుకార్లు పుట్టించారు. వీరి మధ్య ఏవో గొడవలున్నాయంటూ జోరుగా ప్రచారం చేసేశారు. వీరిద్దరూ కలిసి 'ఎన్‌జీకే' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో సాయి పల్లవి సూర్యకు భార్యగా నటిస్తోంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆఫీసర్‌ పాత్రలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. అయితే తమ తమ పాత్రల పరంగా వీరిద్దరి మధ్యా గిల్లికజ్జాలు స్టార్ట్‌ అయ్యాయనీ, పాత్ర నిడివి విషయంలో ఇద్దరూ చిత్ర యూనిట్‌పై చిర్రుబుర్రులాడారనే వార్త హాట్‌ హాట్‌గా చక్కర్లు కొట్టింది. సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా ఆమెపై ఏవో ఒక గాసిప్స్‌ పుట్టుకొస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే సౌత్‌ని వదిలి, నార్త్‌కెళ్లాక రకుల్‌పై కూడా ఇలాంటి గొడవలు ఎక్కువైపోయాయ్‌. అలాంటిది ఈ కాంట్రవర్సీ భామలిద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు ఎవరో ఒకరికి కన్ను కుట్టదూ. అందుకే ఇదిగో ఇలా ఏదో ఒక ప్రచారం తెరపైకి తీసుకొచ్చి అలా వారి శునకానందం తీర్చుకుంటుంటారు.

 

కానీ, ఈ రచ్చపై తాజాగా రకుల్‌ స్పందించింది. 'మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ట్రావెల్‌ అయ్యాం. మా మధ్య ఎలాంటి గొడవల్లేవ్‌. మా ఇద్దరి పాత్రలకూ ప్రాధాన్యత ఎక్కువే. ఈక్వెల్‌ ఇంపార్టెన్స్‌ ఇచ్చారు డైరెక్టర్‌ సెల్వ రాఘవ.. మాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.. అంటూ రకుల్‌ స్పందించింది. సో ఇంతటితో ఈ గొడవ సద్దుమనిగినట్లేనేమో. అయినా సోషల్‌ ఆకతాయిలు ఇంతటితో ఆగుతారో లేదో. ఈ నెల 31న 'ఎన్‌జీకే' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS