ప్రముఖ రాజకీయ వేత్త గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యమ్రాన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. గల్లా జయదేవ్ కుటుంబానికీ, చిరంజీవి కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. సూపర్ స్టార్ మహేష్బాబుకి గల్లా జయదేవ్ బావ అన్న సంగతి తెలిసిందే. మహేష్కీ, చరణ్కీ మంచి స్నేహం ఉంది. సో ఈ రకంగా గల్లా జయదేవ్ ఆహ్వానం మన్నించి ఈ సినిమా ఓపెనింగ్కి చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు.
సోషల్ మీడియాలో తమ తమ అభిమాన హీరోల గురించి అభిమానులు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటారు. కానీ, హీరోలు మాత్రం అవకాశమొచ్చినప్పుడల్లా తమ మధ్య స్నేహ బంధాన్ని చాటుకుంటూనే ఉంటారు. మహేష్ మేనల్లుడి సినిమా కోసం ఇప్పుడు చరణ్ రావడం కూడా అలాగే అర్ధం చేసుకోవాలి. అన్నట్లు ఈ కార్యక్రమానికి మహేష్ వస్తాడో లేదో ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే, 'సరిలేరు..' షూటింగ్ నిమిత్తం మహేష్ కేరళలో ఉన్నారు. ఇకపోతే, ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న హీరో గల్లా అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.