'సూర్య'కు ఛీఫ్‌ గెస్ట్‌ 'చిట్టిబాబు'

మరిన్ని వార్తలు

మెగా ఫ్యామిలీలో ఏవో తగాదాలున్నాయంటూ, ఎవరి దారిన వారున్నారంటూ గాసిప్స్‌ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఆ గాసిప్స్‌ని మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడూ పట్టించుకోదు. అయితే శ్రీరెడ్డి ఇష్యూ ఓ రకంగా మంచి పనే చేసిందని చెప్పాలి.

శ్రీరెడ్డి ఇష్యూతో మెగా ఫ్యామిలీ అంతా ఒకే తాటిపైనే ఉన్నట్లు ప్రచారం జరిగింది. జరుగుతోంది. అందులో భాగంగానే బన్నీ తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి చరణ్‌ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడనీ తెలుస్తోంది. ఈ నెల 29న జరగబోయే ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి చరణ్‌ని బన్నీ స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారమ్‌. ఇటీవల జరిగిన సూర్య ఆడియో రిలీజ్‌ వేడుకకు మెగా బ్రదర్‌ నాగబాబు విచ్చేశారు. ఈ సారి ఆ ఛార్జ్‌ చిట్టిబాబు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాని లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 4న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్‌ నటుడు అర్జున్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సైనికుడి పాత్రలో అల్లు అర్జున్‌ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. 'డీజె' తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు రచయితగా పని చేసి, అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రానికి కథనందించిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS