'మహానటి' చిత్రం ఫై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్

మరిన్ని వార్తలు

'మహానటి' చిత్రం విడుదలై దాదాపు నెల రోజులు కావచ్చింది. ఇంకా ఈ చిత్రానికి క్రేజ్ తగ్గలేదు అంటే నమ్మండి. కారణం- ప్రేక్షకులు పెద్ద స్థాయిలో ఆకర్షితులు అవ్వడమే. మహానటి సావిత్రి గారి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకేక్కించగా, వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమా బ్యానర్ లో అశ్వినీ దత్, స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 9 న విడుదల అయింది.

మహానటి విడుదల అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ ని సైతం రాబట్టగలిగింది. ఇక పలుగురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా పిలిచి ఈ చిత్ర యూనిట్ ని సన్మానించారు.

ఇప్పుడు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం గురించి ప్రశంసించాడు. 'నటుడిగా అందం, ప్రేమ, గౌరవంతో ఈ సుప్రసిద్ధ పాత్రను అందజేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కి కృతజ్ఞతలు. కీర్తీ సురేష్ నటన అద్భుతంగా చేసింది. ఈ చిత్రంలో నటించిన దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలకు నా అభినందనలు' అని తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేసాడు రామ్ చరణ్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS