నిర్మాతగా మారుతున్న హీరోయిన్‌

మరిన్ని వార్తలు

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్యూట్‌గా పలకరించిన బ్యూటీ శ్వేతా బసుప్రసాద్‌. అప్పట్లో ఆ సినిమాతో యూత్‌ని బాగా ఇంప్రెస్‌ చేసిందీ ముద్దుగుమ్మ. వస్తూ వస్తూనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. అయితే ఆ తర్వాత శ్వేతా నటించిన ఏ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. 

కొన్ని వివాదాల్లో చిక్కుకుని మొత్తం సినిమాలకు దూరమైపోయింది. అయితే ఈ బ్యూటీ కేవలం నటి మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్‌. పలు చిత్రాలకు స్క్రిప్టు రైటర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే అందాల శ్వేతాబసు ఓ స్క్రిప్టు రెడీ చేస్తోందట. ఈ సినిమాని తానే స్వయంగా నిర్మిస్తుందట. కానీ డైరెక్షన్‌ మాత్రం చేయనంటోంది అందాల శ్వేతాబసు. మొదట్నుంచీ తనకు డైరెక్షన్‌ అంటే ఇష్టం లేదట. కథలు రాస్తుంది, సినిమాలు నిర్మిస్తుంది కానీ, డైరెక్షన్‌ జోలికి మాత్రం పోనంటోంది. మొత్తానికి రీ ఎంట్రీలో శ్వేతాబసు ఇంట్రెస్టింగ్‌ థాట్‌తో ఎంట్రీ ఇస్తోంది. 

ఇవన్నీ కాక, ఆల్రెడీ సోషల్‌ మీడియాలో శ్వేతా బసు నటించిన 'గ్యాంగ్‌స్టర్స్‌' అనే ఓ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌లో ఉంది. బాలీవుడ్‌లో బుల్లితెర సీరియల్‌లోనూ శ్వేతా బసు నటిస్తోంది. ఇక సినిమాల్లో నటన సంగతి ఆలోచించాలంటోంది. అయితే లేటెస్టుగా శ్వేతా బసు తన పెళ్లి వార్త కూడా బయటపెట్టి అందరికీ షాక్‌ ఇచ్చింది. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నాననీ లేటెస్టుగా ప్రకటించింది శ్వేతాబసు. 

అలాగే అతి త్వరలో శ్వేతా బసు నిర్మించబోయే సినిమాకి సంబంధించిన డీటెయిల్స్‌ కూడా వెల్లడి చేస్తానంటోంది. పెళ్లి తర్వాత భర్త సహకారంతో అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తానని శ్వేతాబసు చెబుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS