గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న పేరు, ప్రఖ్యాతలు ప్రత్యేకమైనవి. మెగా వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి, తన హార్డ్ వర్క్ తో, నడత, నడవడిక తో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. చరణ్ కీర్తి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి పాకింది. రీసెంట్ గా పాకిస్థాన్ లో కూడా రామ్ చరణ్ యాక్టింగ్ గూర్చి చర్చకు రావటం ఇందుకు నిదర్శనం. నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ అందర్నీ ఆకట్టుకుంటాడు చరణ్. ఇంత గొప్ప వ్యక్తితో వర్క్ చేయాలని చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. చరణ్ డేట్స్ ఇస్తే ఎన్ని రోజులైనా వెయిట్ చేయటానికి కూడా రెడీగా ఉన్నారు.
చెర్రీ నుంచి RRR తరవాత ఇంకో సినిమా రాలేదు. ప్రజంట్ సెన్షేనల్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. నెక్స్ట్ బుచ్చి బాబు సానా తో ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పానిండియా సినిమాలే. ఈ గ్లోబల్ స్టార్ కి హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని, హాలీవుడ్ మేకర్స్ చెర్రీని సంప్రదిస్తున్నారని టాక్. కానీ వీటికి చెర్రీ ఓకే చెప్పటం లేదంట. హోల్డ్ లో పెడుతున్నాడని తెలుస్తోంది.
అదేంటి నిన్న కాక మొన్న వచ్చిన స్టార్స్ కూడా పానిండియా, పాన్ వరల్డ్, హాలీవుడ్ అంటూ అర్రులు చాస్తుంటే, చెర్రీ మాత్రం హాలీవుడ్ ఆఫ్ర్స్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారట. కానీ చెర్రీ ఆలోచన వేరు అవకాశం వచ్చింది కదా అని వచ్చిన ప్రతి సినిమాని ఒప్పుకోకుండా, ముందు ఇంట గెలిచి తరవాత రచ్చ గెలవాలని అనుకుంటున్నాడని సమాచారం. ముందు పాన్ ఇండియా లో తిరుగులేని విజయాలు సాధించి, తరవాత పాన్ వరల్డ్ పై ద్రుష్టి పెట్టె దిశగా చరణ్ ఆలోచన చేస్తున్నాడట. ఫ్యూచర్ లో ఈ గ్లోబల్ స్టార్ హాలీవుడ్ లో పాగా వేయటం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.