చరణ్‌తో 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌.!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమాతో సంచలన విజయం అందుకున్న డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. ఆ సినిమా విజయంతో సందీప్‌రెడ్డికి డైరెక్టర్‌గా వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌లో 'అర్జున్‌రెడ్డి రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. షాహిద్‌కపూర్‌ హీరోగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. 

టాలీవుడ్‌లో సెన్సేషన్‌ కొట్టిన ఈ డైరెక్టర్‌ రెండో సినిమాకే బాలీవుడ్‌కి చెక్కేయడం. ఇక్కడ సంచలన విజయం అందుకున్న అదే సినిమాని అక్కడ కూడా రీమేక్‌ చేస్తుండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా, టాలీవుడ్‌ అర్జున్‌రెడ్డిలా, బాలీవుడ్‌ అర్జున్‌రెడ్డితోనూ రికార్డు హిట్‌ కొట్టాడంటే, మనోడి రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. 

ఇక ఈ సంగతిటుంచితే, తాజాగా మెగావపర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో సందీప్‌రెడ్డి వంగా ఓ సినిమా చేయనున్నాడంటూ ఓ గాసిప్‌ ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ చరణ్‌కి స్టోరీ లైన్‌ వినిపించాడనీ, చరణ్‌ ఆ స్టోరీకి దాదాపు ఓకే చెప్పాడనీ ప్రచారం జరుగుతోంది. ఇదో డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అనీ తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌ నటిస్తున్న బోయపాటి శీను సినిమా పూర్తి కాగానే సందీప్‌రెడ్డి సినిమా కోసం డేట్స్‌ అడ్జస్ట్‌ చేయనున్నాడనీ టాక్‌ వినిపిస్తోంది. 

అయితే బోయపాటి శీను సినిమా తర్వాత చరణ్‌, రాజమౌళి మల్టీ స్టారర్‌లో నటించాల్సి ఉంది. ఆ సినిమా కోసం మరే కొత్త సినిమాకీ డేట్స్‌ ఇవ్వడం లేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. మరి ఈ తాజా గాసిప్‌ సంగతేంటో నిదానంగా చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS