మలయాళ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేయనున్న రామ్ చరణ్.!

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి. 'కొణిదెల ప్రొడక్షన్స్' బ్యానర్ లో మెగాస్టార్ 'చిరంజీవి' తో తను నిర్మించిన మొదటి చిత్రం 'ఖైదీ నెం.150'. సుమారు 150 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే చిరంజీవికి సుమారు 300 కోట్ల తో..తన చిరకాల కోరిక 'సైరా నరసింహారెడ్డి'ని నిర్మించి కానుకగా ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ మరియు రషెస్ చూస్తుంటే 'సైరా' మరో మెగా బ్లాక్ బస్టర్ కానుందని చెప్పనక్కర్లేదు.

 

ఇంతటి తో ఆగకుండా చరణ్ మరో బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. మలయాళం సూపర్ స్టార్ 'మోహన్ లాల్' నటించిన 'లూసిఫర్' కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేసి దాదాపు 200 కోట్ల గ్రాస్ సాధించింది. మలయాళ నటుడు 'పృథ్వి రాజ్' ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 

'కొణిదెల ప్రొడక్షన్స్' తన చిత్రం యొక్క రైట్స్ కొనుక్కోవడం తనను థ్రిల్ కు గురి చేసిందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నాడు పృథ్వి రాజ్. మరి ఇందులో హీరోగా నటించిన మోహన్ లాల్ పాత్ర చిరంజీవి చేస్తారా లేక ఇంకెవరైనా నటిస్తారా అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS