చిరుకీ, ప‌వ‌న్‌కీ అత‌నే కావాల‌ట‌!

మరిన్ని వార్తలు

మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ రీమేకుల‌పై ప‌డ్డారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన `లూసీఫ‌ర్‌`ని చిరు, `అయ్య‌‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`ని ప‌వ‌న్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. లూసీఫ‌ర్‌కి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌.. సాగ‌ర్ చంద్ర‌కు అప్ప‌గించారు. అయితే ఈ రెండు రీమేకుల్లోనూ ఓ కామ‌న్ పాయింట్ ఉంది. అదేంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ రానా న‌టిస్తాడ‌ట‌.

 

`అయ్య‌ప్ప‌యుమ్..` ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా. మ‌ల‌యాళంలో బీజూమీన‌న్‌, పృథ్వీరాజ్ క‌లిసి న‌టించారు. బీజూ మీన‌న్ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టించ‌డం ఖాయం అయ్యింది. ఫృథ్వీరాజ్ పాత్ర‌లో.. రానా న‌టిస్తాడ‌ని ప్రచారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రానా పేరు అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఇప్పుడు `లూసీఫ‌ర్‌`లోనూ రానాకి ఛాన్స్ ద‌క్కింద‌ని తెలుస్తోంది. `లూసీఫ‌ర్‌` సెకండాఫ్‌లో ఓ గెస్ట్ రోల్ లాంటిది ఉంటుంది. అందులోనూ.. పృథ్వీరాజే న‌టించారు. ఆ పాత్ర కోసం రానాని ఎంచుకోబోతున్నార‌ని స‌మాచారం.

 

`లూసీఫ‌ర్‌` లో ఫృథ్వీరాజ్ పాత్ర ప‌రిధి త‌క్కువ‌. కానీ.. రానా కోసం దాన్ని పెంచుతున్నార్ట‌. మొత్తానికి అన్నా, ద‌మ్ముల సినిమాలు రెండింటిలోనూ.. రానానే ఎంచుకోవాల‌ని చూస్తున్నారు. రెండు చోట్ల‌.. పృథ్వీరాజ్ చేసిన పాత్రే కావ‌డం మ‌రో విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS