శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం `రణరంగం`. కాజల్, కల్యాణి ప్రియదర్శి కథానాయికలుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. రివ్యూలు, పబ్లిక్ టాక్ ప్రకారం.. చూస్తే బిలో యావరేజ్ రిజల్ట్ వచ్చింది. కానీ... తొలిరోజు వసూళ్లు మాత్రం బాగున్నాయి. 3.6 కోట్లు సాధించి శర్వా గత చిత్రాల రికార్డుల్ని తిరగరాసింది.
నైజాంలో 1.4 కోట్లు తెచ్చుకున్న రణరంగం, ఉత్తరాంధ్రలో సరిగ్గా 50 లక్షలు సాధించింది.సీడెడ్లో 47 లక్షలొచ్చాయి. శతమానం భవతి తొలి రోజు రూ.3.03 కోట్లు సాధించిన రికార్డుని రణరంగం తిరగరాసింది. గురువారం సెలవు దినం కావడం... ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రూ.12 కోట్లకు అమ్మారు. శని, ఆదివారాలు కూడా వసూళ్లు బాగుంటే... ఆర్థికంగా ఈ సినిమా గట్టెక్కే ఛాన్సుంది.