టీజర్‌ టాక్‌: వావ్‌.! శర్వానంద్‌ ఏం చెప్పాడండీ!

మరిన్ని వార్తలు

కొందరు చెబితే ఆ మాటలు బాగా ఎక్కేస్తుంటాయ్‌. అలాంటి వారిలో శర్వానంద్‌ ఒకడు. శర్వానంద్‌ ప్రస్తుతం 'రణరంగం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో 'దేవున్ని నమ్మాలంటే, భక్తి ఉంటే సరిపోతుంది. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలి..' అనే మాట నేటి సిట్యువేషన్స్‌లో బాగా కనెక్ట్‌ అయిపోతుంది. టీజర్‌కి ఈ మాటే హైలైట్‌గా నిలిచింది. దీంతో పాటు, 'కోపాన్నీ, దాహాన్నీ ఇంకొకరు శాసించే స్థితిలో మనం ఉండకూడదు' వంటి డైలాగులు కూడా కనెక్టివ్‌గా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్‌ రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

'కొందరికి అతను నేరస్థుడు.. కొందరికి మాత్రం హీరో..' అంటూ 90ల కాలం నాటి కథని టీజర్‌తో చెప్పే ప్రయత్నం చేశారు. హీరోయిన్స్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌, కళ్యాణీ ప్రియదర్శిన్‌ ఇద్దరికీ ఈ టీజర్‌లో చోటు దక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. సుధీర్‌ వర్మ దర్శకుడు. ఇంతవరకూ ఫస్ట్‌లుక్‌ తప్ప ఈ సినిమా గురించి చిన్న క్లూ కూడా ఇవ్వకపోయినా, ఫస్ట్‌ టీజర్‌ కేక పుట్టించేసింది. టీజర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆగస్ట్‌లో 'రణరంగం' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS