గ్యాంగ్‌స్టర్‌గా శర్వా ఇన్ని యాంగిల్సా?

మరిన్ని వార్తలు

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'రణరంగం' ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఆ క్రమంలో విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో 1980ల కాలం నాటి లిక్కర్‌ మాఫియా గురించి చూపించారు. అలాగే ఇంకోవైపు శర్వా, కళ్యాణీ ప్రియదర్శిని మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా చూపించారు. ఇదంతా ఫ్లాష్‌ బ్యాక్‌లో జరిగే స్టోరీ. ఆ తర్వాత విదేశాల్లో రిచ్‌ లొకేషన్స్‌ని టచ్‌ చేశారు. రిచ్‌ గ్యాంగ్‌స్టర్‌గా శర్వాని చూపిస్తూ, మరో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, శర్వా మధ్య సీన్స్‌ కట్‌ చేశారు.

 

ఈ రెండు వేరియేషన్స్‌ని చూపించడం కోసం శర్వానంద్‌ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించాడు. ప్రజెంట్‌ రిచ్‌ లుక్స్‌లోనూ, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లోనూ కూడా శర్వానంద్‌ గెటప్‌ ఆకట్టుకుంటోంది. సముద్రం ద్వారా జరిగే స్మగ్లింగ్‌ అంశాల్నీ కూడా కథలో భాగంగా చూపించనట్లు తెలుస్తోంది. 'నీళ్ల కోసం మూడో ప్రపంచ యుద్దం జరుగుతుంది.. అంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది..' అనే డైలాగ్స్‌ లోతుగా ఆకట్టుకుంటున్నాయి.

'పడి పడి లేచె..' తర్వాత శర్వా నుండి వస్తోన్న సినిమా ఇది. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మేట్‌ కాకుండా, కొంచెం సీరియస్‌ సబ్జెక్ట్‌లా 'రణరంగం' సినిమాని ప్రమోట్‌ చేస్తుండడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి. సుధీర్‌ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో సినిమా 'ఎవరు' సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కావడంతో శర్వాకి తిరుగే లేదంటున్నారు. చూడాలి మరి, 'రణరంగం'తో ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటాడో శర్వానంద్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS