200 కోట్ల క్లబ్‌లోకి చిట్టిబాబు

మరిన్ని వార్తలు

గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రంగస్థలం' చిత్రం ఏకధాటిగా వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది. వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు ఈ సినిమాకి. మధ్యలో మహేష్‌బాబు నటించిన 'భరత్‌ అనే నేను' పెద్ద చిత్రం విడుదలైనా కానీ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ 'రంగస్థలం' మేనియా తగ్గడం లేదు. ఓవరాల్‌గా గ్రాస్‌ 200 కోట్లకు చేరిందని అఫీషియల్‌గా డిక్లేర్‌ చేశారు. 

120 కోట్ల షేర్‌ దక్కించుకుంది ఈ సినిమా. ఇది మామూలు విషయం కాదు, ఇక ఓవర్సీస్‌లో ఇంతవరకూ అకౌంటే లేని రామ్‌చరణ్‌ ఈ సినిమాతో ఏకంగా ఇంతవరకూ ఉన్న ఓవర్సీస్‌ రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. మెగా పవర్‌ స్టార్‌ స్టామినా అంటే ఇది అని చూపించాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం విడుదలకు ముందు ఎక్స్‌పెక్టేషన్స్‌ అధికంగా ఉన్నప్పటికీ, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోవడంలో ఎంత మాత్రం విజయం సాధిస్తుందో ఎవ్వరికీ నమ్మకం లేదు. కానీ సినిమా విడుదలయ్యాక అందరి అనుమానాలు పటాపంచలయ్యేలా రికార్డుల మోత మోగించింది. 

ఈ మధ్య కాలంలో వారం రోజులకు మించి రెండో వారం ఆడిందే లేదు. అలాంటిది విడుదలై నెల కావస్తున్నా, 'రంగస్థలం' సినిమా దూకుడు తగ్గకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఒక్కో అంశాన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చిత్రీకరించడం, అన్నింటికీ మించి, 'చిట్టిబాబు'గా రామ్‌చరణ్‌ని చూసేందుకు రెండు కళ్లూ చాలకపోవడమే ఈ స్థాయిలో వసూళ్లకు ముఖ్య కారణం. 

చూడాలి మరి, 'రంగస్థలం' ఇంకా ఇంకా ఎన్నెన్ని రికార్డులు కొల్లగొడుతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS