రష్మీ భలే పాయింట్‌ ఎత్తుకుందే!

మరిన్ని వార్తలు

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయిన రష్మీ గౌతమ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వివరణ ఇచ్చింది. ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం, హత్య ఘటన అందర్నీ ఉలిక్కి పడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల రేష్మీ తాజాగా స్పందించింది. అలాంటి ఉన్మాదుల్ని పబ్లిగ్గా ఉరి తీయాలని సెలవిచ్చింది. అంతేకాదు, గతంలో అమ్మాయిల అత్యాచారాలకూ, అనవరసర అకృత్యాలకూ వారు ధరించే దుస్తులే కారణమని ఓ నెటిజన్‌ రష్మీతో వితండ వాదం చేశాడు.

 

అందుకు తగ్గట్లుగానే రష్మీ కూడా సదరు నెటిజన్‌కి కౌంటర్‌ ఇచ్చింది. పలు టీవీ ఛానెల్స్‌ డిబేట్‌ ప్రోగ్రాంస్‌లోనూ ఇదే విషయమై జోరుగా చర్చ సాగింది. సరిగ్గా ఇదే పాయింట్‌ని బేస్‌ చేసుకుని రష్మీ గౌతమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ధీటైన ప్రశ్నలు సంధించింది. ఆ తొమ్మిది నెలల పసికందులో ఏమి గ్లామర్‌ కనిపించింది. ఆ చిన్న పాప వేసుకున్న దుస్తులే ఆమెపై ఇంతటి అఘాయిత్యానికి కారణమా.? ఆ పసికందులో ఏమి ఎక్స్‌పోజింగ్‌ కనిపించింది.? అంటూ వరుసగా ప్రశ్నలు సంధించింది. అవును నిజమే. మృగాళ్లకు ఎక్స్‌పోజింగ్‌తో పనిలేదు.

 

కామ వాంఛ తీర్చుకునేందుకు వావి, వరస, వయసుతో సంబంధం లేకుండా పోయింది. ఆఖరికి జాలిపడాల్సిన వికలాంగులు కూడా అమ్మాయిలపై అకృత్యాలకు దిగుతుంటే ఎక్కడికి పోతోంది ఈ సమాజం. ఈ సమాజానికేమైంది.? అనుకోవడం తప్ప చేసేదేముంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS