ఆ క్షణం ఓ పీడకల అంటున్న రష్మిక.

మరిన్ని వార్తలు

కివీస్ చేతిలో ఓటిమి చవిచూసి వరల్డ్ కప్ ఫైనల్ కి అడుగు దూరం ఆగిపోయింది భారత్. ఈ మ్యాచ్ లో ధోనీ రనౌట్‌ సగటు క్రికెట్ ఫ్యాన్ కి పీడకలగా మిగిలిపోయింది. అంగుళం దూరంలో ఆనందం మాయమైయింది. ఈ రన్ అవుట్ హీరోయిన్ రష్మిక కి కూడా ఓ పీడకలలా మారిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. ''ఈ వరల్డ్‌కప్‌ చాలా బాధని మిగిల్చింది . సెమీ ఫైనల్‌లో ధోనీ రనౌట్‌ అవ్వడం హార్ట్ బ్రేక్. ఆ క్షణం ఓ పీడకల. చాలాసేపు నమ్మలేకపోయా'' అని చెప్పింది రష్మిక.

 

''డియర్ కామ్రేడ్'' సినిమాలో రష్మిక క్రికెటర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర గురించి చెబుతూ.. ''ఇందులో నేను క్రికెటర్ ని. తెరపై నేను క్రికెట్‌ ఆడేది కాసేపే. కానీ అందుకు సంబంధించిన సన్నివేశాల కోసం చాలా ప్రాక్టీస్ చేశా. నేను క్రికెట్‌ ఎప్పుడూ ఆడలేదు. తొలిసారి బ్యాటు పట్టుకున్నా. క్రికెట్‌కి సంబంధించిన టెర్మినాలజీ తెలుసుకునే ప్రయత్నం చేశా.'' అని చెప్పింది ఈ కన్నడ బ్యూటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS