మళ్లీ 'బలుపు' ప్రదర్శిస్తానంటోన్న 'డాన్‌ శీను'.!

By iQlikMovies - August 30, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

'బలుపు', 'డాన్‌ శీను' సినిమాలతో మాస్‌ హిట్స్‌ అందుకున్న రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబో ముచ్చటగా మూడోసారి జత కట్టబోతున్నారు. ఈ కాంబోలో త్వరలోనే ఓ సినిమా రానుందట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు స్టార్ట్‌ అయ్యాయనీ సమాచారం. ఇటీవల ఈ కాంబోపై పలు గాసిప్స్‌ వచ్చాయి. అయితే, తాజాగా డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ట్విట్టర్‌ వేదికగా ఆ గాసిప్స్‌కి చెక్‌ పెట్టేశారు. త్వరలోనే రవితేజతో సినిమా ఉండబోతోందని కన్‌ఫామ్‌ చేశారు. సో రవితేజ నుండి ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌కి గోపీచంద్‌ రంగం సిద్ధం చేస్తున్నాడని క్లారిటీ వచ్చేయడంతో ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు.

 

ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాని క్రిస్‌మస్‌ కానుకగా డిశంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ సినిమాలో రవితేజతో జోడీ కడుతున్నారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి రవితేజ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కాలాన్ని వెనక్కి పంపడం అనే ఓ విభిన్న కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమా పూర్తి కాగానే, గోపీచంద్‌ మలినేని సినిమాని పట్టాలెక్కించేయనున్నాడట మాస్‌ రాజా రవితేజ. ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా మాత్రం రవితేజ మార్క్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS