మాస్‌రాజా ఈ సారి మల్టీ స్టారర్‌లో?

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, మాస్‌ రాజా తదుపరి చిత్రం కోసం ఓ రీమేక్‌ని ఎంచుకున్నాడనీ తెలుస్తోంది. తమిళ బ్లాక్‌ బస్టర్‌ అయిన 'విక్రమ్‌ వేద' సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఎప్పటి నుండో సన్నాహాలు జరుగుతున్నాయి.

 

తాజాగా ఈ రీమేక్‌ మూవీకి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించనున్నాడన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది. మాధవన్‌, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మాధవన్‌, గ్యాంగ్‌స్టర్‌గా విజయ్‌ సేతుపతి నటించారు. వీరిద్దరి పాత్రల్ని మ్యాచ్‌ చేసే కాంబినేషన్‌ కోసం టాలీవుడ్‌లో వేట సాగుతోంది. ఈ క్రమంలోనే మాస్‌ రాజా రవితేజను మాధవన్‌ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర కోసం ఓ యంగ్‌స్టర్‌ని వెతుకుతున్నారట.

 

గ్యాంగ్‌స్టర్‌ పాత్ర అంటే, చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. అలాంటి పాత్రను పోషించదగ్గ యంగ్‌ హీరో ఎవరనే విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్‌లో. అల్రెడీ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ 'రణరంగం' కోసం గ్యాంగ్‌స్టర్‌ అవతారమెత్తాడు. మంచి మార్కులేయించుకున్నాడు. ఇక తాజాగా హరీష్‌ శంకర్‌ కోసం వరుణ్‌ తేజ్‌ కూడా భయంకరమైన గెటప్‌లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు 'వాల్మీకి' చిత్రంలో. ఇక మాస్‌ రాజా కోసం గ్యాంగ్‌ స్టర్‌ అవతారమెత్తబోయే ఆ కొత్త హీరో ఎవరో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS