'ఎవరు' రెజీనాకి అంత స్పెషలా?

మరిన్ని వార్తలు

రెజీనా నటిస్తున్న తాజా చిత్రం 'ఎవరు' ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రెజీనా సినిమాకి సంబంధించి కొన్ని ముచ్చట్లు మీడియాతో పంచుకుంది. సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. దాదాపు కథలో 80 శాతం ఆమె పైనే చిత్రీకరించబడిందట. అవును నిజమే, ప్రచార చిత్రాలు చూస్తుంటే, ఈ సినిమాలో రెజీనా పాత్ర కీలకమనే అనిపిస్తోంది.

 

అడవి శేష్‌, నవీన్‌ చంద్రలు ఇతర కీలక పాత్ర ధారులుగా చెప్పుకోవాలి. పీవీపీ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఓ కాజ్‌తో తెరకెక్కిందట. సినిమా ప్రతీ ఒక్కరూ చూడదగ్గది అని రెజీనా చెప్పుకొస్తోంది. గ్లామర్‌ హీరోయిన్‌గా రెజీనా చేయాల్సిందంతా చేసింది. కానీ, అప్పుడప్పుడూ అవకాశమొచ్చినప్పుడు తనలోని నటికి కూడా టెస్ట్‌ పెడుతూనే వచ్చింది. అలా టెస్ట్‌ పెట్టిన ప్రతీసారి రెజీనా సక్సెస్‌ అవుతూనే వచ్చింది. 'అ' ఒక ప్రయోగాత్మక చిత్రం. ఆ చిత్రం కోసం రెజీనా పడిన కష్టం సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అందుకే ఆమె కష్టాన్ని గుర్తించి, 'అ' సినిమాకి నేషనల్‌ అవార్డు కట్టబెట్టారు. బెస్ట్‌ మేకప్‌ కేటగిరీలోనే 'అ'కి నేషనల్‌ అవార్డు దక్కింది.

 

బాలీవుడ్‌లో 'ఏక్‌ లడఖీకో ఐసా లగా' సినిమా కోసం రెజీనా లెజ్బియన్‌ అవతారమెత్తింది. ఈ సినిమా కూడా విజయం సాధించింది. ఇలాంటి సినిమాల లిస్టులోకే 'ఎవరు' కూడా చేరుతుందని, తన కెరీర్‌లో 'ఎవరు' ఓ బెస్ట్‌ ఫిలిం అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది రెజీనా. అందుకే 'ఎవరు' తనకి చాలా చాలా స్పెషల్‌ అని చెబుతోంది. వెంకట్‌ రాంజీ దర్శకత్వంలో 'ఎవరు' చిత్రం తెరకెక్కింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS