లెక్చర్లు మానండి: ఫ్యాన్స్‌పై ఫైర్‌ అయిన రేణూదేశాయ్‌.!

By Inkmantra - April 12, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ మాజీ సతీమణి రేణూ దేశాయ్‌కి కోపమొచ్చింది. ఎందుకంటే, పవన్‌ అభిమానులు, జనసేన అభిమానులు ఆమెను సోషల్‌ మీడియాలో విసిగిస్తున్నారట. ఓటు హక్కుపై ఆమెకు సూచనలు, సలహాలూ ఇస్తూ, ఫింగర్‌ ఫ్రూప్స్‌ పంపిస్తూ, మా బాధ్యత నిర్వర్తించాం. మీరు కూడా మీ బాధ్యతను నిర్వర్తించుకోండి.. అంటూ రేణూకి లెక్చర్లు ఇస్తున్నారట. 

 

సోషల్‌ మీడియాలో రేణూదేశాయ్‌ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆ క్రమంలోనే పవన్‌ ఫ్యాన్స్‌ కూడా ఆమెతో టచ్‌లో ఉంటుంటారు. తాజాగా ఎలక్షన్స్‌ నిమిత్తం ఫ్యాన్స్‌ రేణూదేశాయ్‌తో ఈ విధంగా ప్రవర్తించారు. విసిగిపోయిన రేణూదేశాయ్‌ నా బాధ్యత విషయంలో నేనెవరి చేతా సూచనలు, సలహాలూ తీసుకునే పరిస్థితిలో లేను. నా ఓటు హక్కు పూణెలో ఉంది. ఈ నెల 23న నేను నా బాధ్యతను నిర్వహిస్తాను. 

 

దయచేసి ఓటింగ్‌ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, నాకు మెసేజ్‌లు పెట్టకండి, ఉదయం నుండీ చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. జనహితం కోసమే ఈ పోస్ట్‌ పెడుతున్నాను.. అంటూ రేణూదేశాయ్‌ పేర్కొన్నారు. ఈ మధ్యనే రేణూదేశాయ్‌ నటనలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. ఒక సినిమాకి ఆల్రెడీ సైన్‌ చేశారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గతంలో 'బద్రి', జానీ' సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రేణూదేశాయ్‌ త్వరలో ఇంపార్టెంట్‌ రోల్స్‌తో సందడి చేయనున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS