'సంజూ' ఈ పేరుకు ప్రత్యేకించి పరిచయమక్కర్లేదు. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, సూపర్ డూపర్ టాక్ సంపాదించింది. బాలీవుడ్ బాక్సాఫీస్కి కాసుల పంట పండించింది.
ఇదంతా తెలిసిన విషయమే. అయితే తెలియని విషయమేంటంటే, సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఉన్నారు కదా. ఆయన మళ్లీ 'సంజూ' బయోపిక్ని తెరకెక్కిస్తారట. అదేంటీ ఆల్రెడీ చూసేశాం కదా సంజూ బయోపిక్ని అనుకుంటున్నారా? అదే మరి మన వర్మగారు ఏం చేసినా స్పెషలే కదా. అందుకే హిరాణీ 'సంజూ'లో సంజయ్దత్ గొప్ప వ్యక్తిత్వాన్ని మాత్రమే చూపించారు. అంటే రియల్ బయోపిక్ కాదని రామ్గోపాల్ వర్మ చెబుతున్నారన్న మాట.
తాను తెరకెక్కించబోయే సంజయ్దత్ బయోపిక్ రియలిస్టిక్గా ఉంటుందని వర్మ చెబుతున్నారు. ఆల్రెడీ ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలెట్టేశారట. సంజయ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కేసుల నిమిత్తం సంజయ్ని విచారించిన పోలీసులను వర్మ సంప్రదించి విషయాలు సేకరిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి పక్కా స్క్రిప్టు ప్రిపేర్ చేస్తానని ఆయన అంటున్నారు.
గత రెండు దశాబ్దాలుగా సంజయ్ని వెంటాడుతున్న ఓ పెద్ద సమస్యను ఈ సినిమాలో జెన్యూన్గా చూపిస్తానని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు, ఇంకా సంజయ్ జీవితంలోని చాలా చీకటి కోణాలను ఈ బయోపిక్ ద్వారా చూపించబోతున్నానంటూ ప్రేక్షకుల్లో కొత్త ఆశక్తిని క్రియేట్ చేశారు ఆర్జీవీ. చూడాలి మరి ఈ తాజా ప్రకటనతో వర్మ మళ్లీ ఎలాంటి సంచలనాలకు, కాంట్రవర్సీలకు తెర లేపుతారో.!