సాహో విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ అయినా గానీ తొలి రోజు ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తుందని టాలీవుడ్ నమ్మింది. దానికి తగిన ఫలితమే వచ్చింది. సాహోకి ఫ్లాప్ టాక్ వచ్చినా - తొలి రోజు ప్రభాస్ తన సత్తా చూపించాడు. దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే వంద కోట్ల (గ్రాస్) వసూలు చేసి ఔరా అనిపించాడు. దాదాపు అన్ని చోట్లా నాన్ బాహుబలి (అజ్ఞాతవాసి) రికార్డులు బ్రేక్ చేసింది. నైజాంలో అయితే బాహుబలి రికార్డుని కూడా దాటేసింది.
నైజాంలో 14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సాహో. ఏపీ మొత్తంలో 42 కోట్లు వచ్చాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ కలిపి 17 కోట్లు వసూలు చేసింది. హిందీ మార్కెట్లో దాదాపు 30 కోట్లు తెచ్చుకుంది. మొత్తానికి 104 కోట్ల గ్రాస్ వచ్చింది. షేర్ లెక్కల్లో చూస్తే దాదాపు 68 కోట్లు వచ్చినట్టు లెక్క. ఇది కాకుండా ఓవర్సీస్లో తొలిరోజు 1 మిలియన్ సాధించింది. రెండో రోజు ఎలా ఉంటుందన్నదాన్ని బట్టి సాహో ఫలితం ఆధారపడి ఉంది.