ప్రమోషన్స్‌కి 'సాహో' అనాల్సిందేనట!

మరిన్ని వార్తలు

భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడమే కాదు, ఆ సినిమాని ప్రమోట్‌ చేయడంలోనూ అంతే భారీతనం ప్రదర్శించాలి. ఇప్పుడు 'సాహో' విషయంలో అదే జరుగుతోంది. సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక ఆ సినిమాని మార్కెట్‌ చేయాలి. అందుకోసం అవకాశమున్న అన్ని వనరుల్ని లైన్‌లో పెట్టాలి. అన్నింటికీ మించి భారీ ఎత్తున ఈవెంట్స్‌ కూడా నిర్వహించాలి. మిగిలిన ఇరవై రోజుల్లోనే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలి. అందుకే 'సాహో' యూనిట్‌ ఇందుకోసం కొన్ని ప్రత్యేక టీమ్స్‌ని నియమించిందట.

 

ఆయా టీమ్స్‌ నిర్వహణలో ఈవెంట్స్‌ జరగనున్నాయట. హైద్రాబాద్‌లో ఈ నెల 20న 'సాహో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్‌ నుండి ప్రముఖ నటీనటులు హాజరయ్యే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. అలాగే 27న దుబాయ్‌లో నిర్వహించబోయే ఈవెంట్‌కి బాలీవుడ్‌ ప్రముఖుల్ని ఆహ్వానించారట. అమెరికాలోనూ ఓ భారీ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఇలా అన్నిచోట్లా 'సాహో' స్పెషల్‌ ఈవెంట్స్‌కి రంగం సిద్ధం చేస్తున్నారట.

 

ఓ పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్‌ నిమిత్తం కసరత్తులు వేగవంతం చేశారు ప్రబాస్‌ అండ్‌ టీమ్‌. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహించనున్నారట. ఇదిలా ఉంటే, త్వరలోనే 'సాహో' ట్రైలర్‌ రానుందనీ తెలుస్తోంది. ట్రైలర్‌ని న భూతో న భవిష్యతి అనేలా రూపొందిస్తున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS