ఆగస్ట్ 30న 'సాహో' వరల్డ్ వైడ్గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అందులో భాగంగా, ఇంతవరకూ యాక్షన్ మోడ్లో 'సాహో'ని ప్రమోట్ చేసిన టీమ్, ఇప్పుడు 'సాహో' రొమాంటిక్ యాంగిల్ని ఎక్స్పోజ్ చేస్తోంది. మొన్నటికి మొన్న ప్రబాస్, శ్రద్ధాకపూర్ని క్లోజ్ అప్లో షూట్ చేసిన రొమాంటిక్ పోస్టర్ వదిలింది. ఆ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్లో భాగంగా, తాజాగా ఓ రొమాంటిక్ లిరికల్ సాంగ్ వదిలింది.
'నిన్నలు మరిచేలా.. నిన్ను ప్రేమిస్తాలే.. కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే..' అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మంచు కొండల్లో శ్రద్ధాకపూర్, ప్రబాస్ మధ్య రొమాంటిక్ మూడ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతోంది. కృష్ణకాంత్ సాహిత్యం అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. ఇక రిలీజ్కి కొద్ది వారాలు మాత్రమే ఉండడంతో, ప్రమోషన్స్లో కొత్త స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారట 'సాహో' టీమ్.
ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అన్నిచోట్లా భారీ ఎత్తున ప్రమోషన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుజిత్ దర్శకత్వంలో హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో 'సాహో' తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుండి హీరోయిన్తో పాటు, నీల్ నితిన్ ముఖేష్, మందిరాబేడీ, జాకీ ష్రాఫ్ తదితర ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించింది.